- లష్కరే తోయిబా కంటే హిందూ తీవ్రవాదమే ప్రమాదకరమైనది అని రాహుల్ ’అజ్ఞాని’ గాంధీ వాగితే, అది ఇప్పుడు బైటపడింది.
- ముంబైపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో చనిపోయిన కర్కరే హత్య గురించి దిగ్విజయ్ సింగు, అది హిందూ ఉగ్రవాదుల కుట్రే అనే అర్థం వచ్చేలా అన్నాడు. అలా వాగొద్దని కర్కరే భార్య అతడికి వాతలు పెట్టింది.
- కేంద్ర హోం మంత్రి చిదంబరం కాషాయ ఉగ్రవాదం అంటూ పార్లమెంటులోనే అన్నాడు..
మతం లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
మతం లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
22, డిసెంబర్ 2010, బుధవారం
హిందూ విద్వేష వాద కవిత్వం
11, అక్టోబర్ 2010, సోమవారం
అయోధ్య తీర్పు న్యాయమైనదే!
"అయోధ్య తీర్పు న్యాయంగా లేదు, సాక్ష్యాలను బట్టి కాక, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పు" అని విమర్శిస్తున్నారు ఉగ్ర లౌకికవాదులు.
నిజమే, ఇది సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పు కాదు, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పే! సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పే అయితే, మూడోవంతు కాదు, మొత్తం వివాదాస్పద స్థలమంతా హిందువులకే దక్కి ఉండాల్సింది. ఎందుకంటే..
2, అక్టోబర్ 2010, శనివారం
సునామీ రావాలని కోరుకోకు!
ఈమధ్య బ్లాగుల్లో ఒక కొత్త ధోరణి వచ్చింది - మనకు నచ్చని విషయం ఎక్కడైనా కనిపించిందనుకోండి.. వెంటనే మన బ్లాగుకు వెళ్ళిపోయి దాన్ని విమర్శిస్తూ ఒక కవిత రాసిపడెయ్యడమన్నమాట! ఏదైనా కవితను కాపీకొట్టైనా సరే.. నేనూ ఒక కవిత రాసెయ్యాల్సిందే అనుకున్నాను. కత్తిలాంటి బ్లాగు, మహేష్ కుమార్ గారి పర్ణశాల అందుబాటులో ఉందిగదా.. అందులోని దళిత తీవ్రవాదం అనే టపాను ఎంచుకున్నాను.
7, డిసెంబర్ 2009, సోమవారం
బాబ్రీకట్టడపు కూల్చివేత వార్షికోత్సవం
పురుషోత్తముడి గుడిని కూల్చేసి మసీదునొకదాన్ని కట్టాడో దురాక్రమణదారు. తన జాతి వారసత్వంపై మక్కువ, గర్వమూ ఉన్న ఏ స్వతంత్ర ప్రభుత్వమైనా ఆ కట్టడాన్ని పడేసి మళ్ళీ గుడి కట్టుకుంటుంది. ఎందుకంటే అది జాతి గౌరవంతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఎంచేతో మన ప్రభుత్వాలు ఆ పని చెయ్యట్లేదు. మరి ఇవి ప్రభుత్వాలు కావో, లేక వాటికి ఈ జాతి వారసత్వం పట్ల గౌరవం లేదో!! ప్రభుత్వాలు ఎలాగన్నా పోనీండి.., ఆ పనేదో తామే చేసుకోవాలనుకున్నారు, హిందువులు. ఆ పనిలో సగభాగం పూర్తై మరో ఏడాది గడిచిపోయింది. గుడి కట్టే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు కాలేదు.
24, ఆగస్టు 2009, సోమవారం
హిందూమతంపై దాడి
* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ' హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ' అని చెప్పాడు.
6, డిసెంబర్ 2008, శనివారం
మన భద్రతే మనకు ముఖ్యం
దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు.
11, అక్టోబర్ 2008, శనివారం
కంధమాల్ కథేమిటి?
ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. "రెండేళ్ళ కిందట మీ పారిస్లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?" అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, "ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి" అని చెప్పుండాల్సింది. కనీసం "అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే" అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?
అసలు కంధమాల్లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...
3, అక్టోబర్ 2008, శుక్రవారం
రక్తపాత రహిత కుట్ర !
ఈ జాబుకు ప్రేరణ నాగప్రసాదు రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే జాబు. నిజానికి ఈ జాబు అంతా అక్కడే వ్యాఖ్యగా రాయాల్సింది.. పెద్దదై పోయింది, పైగా కాస్త అసందర్భం అవుతుందేమోనన్న శంక.. అంచేత ఇదిగో ఇక్కడ..
11, ఆగస్టు 2008, సోమవారం
అమరనాథ దేవాలయ స్థల వివాదం
సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే..
ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.
ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది...
ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.
ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది...
19, డిసెంబర్ 2007, బుధవారం
దార్లు కొట్టేవాళ్ళూ డాక్టర్లను కొట్టేవాళ్ళూ
దోపిడీ దొంగలు, దార్లు కొట్టేవాళ్ళూ ఎలా పనిచేస్తారు? అవకాశం చూసుకుని ఒక్కసారిగా మీదపడి, దౌర్జన్యం చేసి, ఎంత హఠాత్తుగా వచ్చారో అంతే అకస్మాత్తుగా మాయమైపోతారు. మళ్ళీ తరువాతి దోపీడీ దాకా కనబడరు.
ఆ ఎమ్మెల్యేల మాట సాధారణంగా వినబడదు పత్రికల్లో, శాసనసభలో కూడా. ఈ మధ్య మాత్రం అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకెక్కుతున్నారు. తస్లీమా నస్రీన్ను కొట్టి ఓ రోజు, నీలోఫర్లో ఓసారి, ప్రసూతి ఆసుపత్రిలో ఓసారి డాక్టర్లను కొట్టి వార్తల్లోకెక్కారు. కొట్టి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ మాటా పేరూ వినబడవు.., తరువాతి దౌర్జన్యం వరకూ. ఈలోగా ప్రభుత్వం మాత్రం ఆ దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసులు పెట్టి, ఎస్మాలు పెట్టి హడావుడి చేస్తూ ఉంటుంది.
ఆ ఎమ్మెల్యేల మాట సాధారణంగా వినబడదు పత్రికల్లో, శాసనసభలో కూడా. ఈ మధ్య మాత్రం అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకెక్కుతున్నారు. తస్లీమా నస్రీన్ను కొట్టి ఓ రోజు, నీలోఫర్లో ఓసారి, ప్రసూతి ఆసుపత్రిలో ఓసారి డాక్టర్లను కొట్టి వార్తల్లోకెక్కారు. కొట్టి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ మాటా పేరూ వినబడవు.., తరువాతి దౌర్జన్యం వరకూ. ఈలోగా ప్రభుత్వం మాత్రం ఆ దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసులు పెట్టి, ఎస్మాలు పెట్టి హడావుడి చేస్తూ ఉంటుంది.
2, అక్టోబర్ 2007, మంగళవారం
హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు... ముస్లిము సోదరులు
హైదరాబాదు జంటపేలుళ్ళపై నా గతజాబు, దానిపై వచ్చిన వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఆ వ్యాఖ్యలకు సమాధానమే ఈ జాబు.
ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఉగ్రవాదులతో చేతులు కలపడాన్ని మనమేమనుకోవాలో చెప్పండి. -క్లుప్తంగా ఇదీ నా గత జాబు! దీనిపైన వచ్చిన విమర్శలోని ముఖ్యాంశాలు, నా జవాబులు:
ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఉగ్రవాదులతో చేతులు కలపడాన్ని మనమేమనుకోవాలో చెప్పండి. -క్లుప్తంగా ఇదీ నా గత జాబు! దీనిపైన వచ్చిన విమర్శలోని ముఖ్యాంశాలు, నా జవాబులు:
28, ఆగస్టు 2007, మంగళవారం
ఉగ్రవాదము, మతమూ
హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరగ్గానే "అన్ని మతాల వాళ్ళూ చనిపోయారు ఒక మతంపై ప్రత్యేకించి చేసిన దాడి కాదు" అని వ్యాఖ్యానాలు వచ్చాయి. సహజంగానే ప్రజలు కూడా ఈ పేలుళ్ళను అలా భావించలేదు. మత పరమైన పర్యవసానాలేమీ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది. అయితే బాధితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. కానీ ఈ ఉగ్రవాదులెవరు? ఈ సంఘటనకు కారకులు ఎవరో ఇంకా తెలీక పోయినా, గత అనుభవాలను బట్టి ఇస్లామిక ఉగ్రవాదులని అనుమానాలు పోతాయి, సహజంగా. కానీ ఉగ్రవాదులకీ మతానికీ ముడిపెట్టకూడదని ఓ... తెగ చెప్పేస్తున్నారు, కొందరు. కానీ అలా కుదురుతుందా?
19, మే 2007, శనివారం
మసీదులో బాంబు
మసీదులో బాంబు! గతంలో పోలీసు కమిషనరేటు మీద మానవ బాంబు దాడి జరిగిన తరువాత కొన్నాళ్ళకనుకుంటా.. పోలీసులు ఇద్దరు ముస్లిము కుర్రాళ్ళని అరెస్టు చేసారు. అందుకు నిరసనగా ముస్లిము ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా కమిషనరేటు మీదకి దండెత్తి వచ్చి, నానా యాగీ చేసి పోయారు. వాళ్ళకి వాళ్ళ నాయకుల మద్దతు కూడా. అనుమానమ్మీద ముస్లిములను అరెస్టు చేస్తేనే అలా అల్లరి చేస్తే, మరి ఇళ్ళల్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేదెట్లా? ఇలాంటి ఘటనలను నివారించేదెట్లా? అంతెందుకు, మే 18 నాటి బాంబు దాడి తరువాత కూడా, మసీదు లోపలికి పోలీసులను రానివ్వలేదట అక్కడి జనం! ఎలాగో తోసుకుని లోపలికి వెళ్ళి చూస్తే మరో రెండు బాంబులు కనబడ్డాయి. వాటిని నిర్వీర్యం చేసారట పోలీసులు. రానివ్వలేదని వాళ్ళు వెళ్ళకపోయి ఉంటే అవీ పేలేయేమో! ఈ సంఘటనలో అనుమానితుడు షాహెద్ బిలాల్ అని పత్రికలు రాస్తున్నాయి.
2, ఏప్రిల్ 2007, సోమవారం
చాప కింద నీరు
గత ఆదివారం ఆంధ్ర జ్యోతిలో మత మార్పిడి వార్త వచ్చింది. మతప్రచారంలో భాగంగా ఈ క్రైస్తవ మిషనరీలు ఎలా పని చేస్తున్నాయో చదివి ఆశ్చర్యపోయాను. గిరిజనుల పేదరికాన్ని, అమాయకత్వాన్ని, చదువులేనితనాన్ని ఆసరాగా చేసుకుని నాగరికులమని చెప్పుకున్నవారు వారి శ్రమను దోచుకోవడం చిరకాలంగా జరుగుతున్నదే. కానీ సేవలో మత విశ్వాసాలను చొప్పించి, గిరిజన సమాజాన్ని ఛిన్నాభిన్నం చెయ్యబూనడం క్రైస్తవ మిషనరీలకే చెల్లింది.
17, సెప్టెంబర్ 2006, ఆదివారం
పోపు గారు.. క్షమించ గోరారు
మతమార్పిడులపై పోపుగారు ఈసారి మాట మార్చారు.
13 వ శతాబ్దంలో మహమ్మదు ప్రవక్తపై బైజాంటైన్ రాజు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని, బయటికి తీసి, ఓ వివాదాన్ని సృష్టించారు.
మధ్యయుగాల్లో ముస్లిములు జరిపిన బలవంతపు మత మార్పిళ్ళపైనే పోపుగారి ప్రస్తుత విమర్శల జోరు.
కొన్ని నెల్ల కిందట ఇదే బలవంతపు మతమార్పిళ్ళపైనే పోపుగారు మనపైనా కొన్ని విసుర్లు విసిరారు .
అయితే ఆనాటి వారి వాదన వేరు.
మూకుమ్మడి మతమార్పిడులకు వ్యతిరేకంగా భారత్లో చట్టాలు చేయరాదని అప్పుడు వారు మనకు చెప్పారు.
(అప్పటి వారి విమర్శలపై ఈ పేజీల్లోనే వచ్చిన నా పాత జాబు ఇది.)
మరి ఇప్పుడేమో ఇలా చెబుతున్నారు.
మధ్యయుగాల్లో కత్తి చూపి మతమార్పిడి చేయించారు,
అది ఆ కాలం తీరు.
ఇప్పుడేమో ప్రచారం తెగ చేసి, ఎరవేసి, ఆశలు చూపి, మొహమాటపెట్టి మూకుమ్మడిగా చేస్తున్నారు,
ఇది ఇప్పటి తీరు.
చేసే పని మాత్రం అదే.., బలవంతపు మతమార్పిడే! తీరే వేరు.
అయితే పోపుగారు మాత్రం..
"ఇప్పుడు మేం చేసేది ఒప్పు, దాన్ని అడ్డుకోరాదు, అప్పుడు ముస్లిములు చేసింది తప్పు, దాన్ని మర్చిపోరాదు" .. అని అంటున్నారు.
ముస్లిములపై మాట మీరారు, చివరికి క్షమించ గోరారు!
13 వ శతాబ్దంలో మహమ్మదు ప్రవక్తపై బైజాంటైన్ రాజు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని, బయటికి తీసి, ఓ వివాదాన్ని సృష్టించారు.
మధ్యయుగాల్లో ముస్లిములు జరిపిన బలవంతపు మత మార్పిళ్ళపైనే పోపుగారి ప్రస్తుత విమర్శల జోరు.
కొన్ని నెల్ల కిందట ఇదే బలవంతపు మతమార్పిళ్ళపైనే పోపుగారు మనపైనా కొన్ని విసుర్లు విసిరారు .
అయితే ఆనాటి వారి వాదన వేరు.
మూకుమ్మడి మతమార్పిడులకు వ్యతిరేకంగా భారత్లో చట్టాలు చేయరాదని అప్పుడు వారు మనకు చెప్పారు.
(అప్పటి వారి విమర్శలపై ఈ పేజీల్లోనే వచ్చిన నా పాత జాబు ఇది.)
మరి ఇప్పుడేమో ఇలా చెబుతున్నారు.
మధ్యయుగాల్లో కత్తి చూపి మతమార్పిడి చేయించారు,
అది ఆ కాలం తీరు.
ఇప్పుడేమో ప్రచారం తెగ చేసి, ఎరవేసి, ఆశలు చూపి, మొహమాటపెట్టి మూకుమ్మడిగా చేస్తున్నారు,
ఇది ఇప్పటి తీరు.
చేసే పని మాత్రం అదే.., బలవంతపు మతమార్పిడే! తీరే వేరు.
అయితే పోపుగారు మాత్రం..
"ఇప్పుడు మేం చేసేది ఒప్పు, దాన్ని అడ్డుకోరాదు, అప్పుడు ముస్లిములు చేసింది తప్పు, దాన్ని మర్చిపోరాదు" .. అని అంటున్నారు.
ముస్లిములపై మాట మీరారు, చివరికి క్షమించ గోరారు!
24, మే 2006, బుధవారం
మత మార్పిడి ఊపు మీద పోపు గారు
భారత్లో మత మార్పిడులు కూడదంటూ చట్టాలు చెయ్యడం ఒప్పనంటున్నారు పోపు గారు. మత స్వేచ్ఛకు అది భంగమట! వంద కోట్ల జనాభా (95 శాతం మంది క్రైస్తవేతరులు), పేదరికం (దుప్పట్లిచ్చి మతం మార్చెయ్యొచ్చు), పరమత సహనంతో ఉండే ప్రజలు (వాళ్ళ పడగ్గదిలోకి వెళ్ళి ప్రచారం చేసినా ఏమీ అనుకోరు), లౌకిక తత్వం (అనగా పెద్ద మతానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుంది), అనుకూలమైన చట్టాలు (లేకపోయినా మార్చుకోవచ్చు).. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే గాల్లో తేలివచ్చే విత్తనాల్లాగా వచ్చి, ఇక్కడ చేరి మొలకలెత్తాలని ప్రయత్నాలు చేసారు, చేస్తున్నారు. పళ్ళ చెట్టుకే గదా రాళ్ళదెబ్బలు!
ఈ దేశం వాళ్ళకి ప్రచారం చేసుకోండి పోండని చెప్పింది. ఇంటి పెరట్లో ఆడుకోండని పక్క వీధి పిల్లలకు చనువిస్తే పెరడంతా పీకి పందిరి వేయబూనినట్లుగా అయింది మన పరిస్థితి. ఎవరో ఒక్కరిద్దరు మతం మారితే అది మారే వాళ్ళిష్టం. మందలుగా, మూకుమ్మడిగా మారితే అది మార్చే వాళ్ళిష్ట ప్రకారం జరుగుతున్నదని అర్థం. ముస్లిము పాలకుల కాలంలో మత మార్పిడులు తెగ జరిగాయి, ఎందుకు? ఇస్లాంపై ప్రేమతోనా? లేక హైందవంపై మొహం మొత్తా? బలవంత మత మార్పిడి మధ్య యుగ సంస్కృతి. ప్రస్తుత సంస్కృతి ఏమిటంటే.. దుప్పట్లిద్దాం, మందులిద్దాం, ఆపై మతం మారుద్దాం. అడ్డుకుంటే, పరమత సహనం లేదంటూ నిందిద్దాం, మతస్వేచ్ఛ గురించి బోధిద్దాం.
మత సంస్కారం, పరమత సహనం అంటే ఏంటో ప్రపంచానికి నేర్పిన ఆధ్యాత్మిక శిఖరానికి పోపు గారు నీతులు చెబుతున్నారు.., ఎంత తెంపరితనం!!
ఈ దేశం వాళ్ళకి ప్రచారం చేసుకోండి పోండని చెప్పింది. ఇంటి పెరట్లో ఆడుకోండని పక్క వీధి పిల్లలకు చనువిస్తే పెరడంతా పీకి పందిరి వేయబూనినట్లుగా అయింది మన పరిస్థితి. ఎవరో ఒక్కరిద్దరు మతం మారితే అది మారే వాళ్ళిష్టం. మందలుగా, మూకుమ్మడిగా మారితే అది మార్చే వాళ్ళిష్ట ప్రకారం జరుగుతున్నదని అర్థం. ముస్లిము పాలకుల కాలంలో మత మార్పిడులు తెగ జరిగాయి, ఎందుకు? ఇస్లాంపై ప్రేమతోనా? లేక హైందవంపై మొహం మొత్తా? బలవంత మత మార్పిడి మధ్య యుగ సంస్కృతి. ప్రస్తుత సంస్కృతి ఏమిటంటే.. దుప్పట్లిద్దాం, మందులిద్దాం, ఆపై మతం మారుద్దాం. అడ్డుకుంటే, పరమత సహనం లేదంటూ నిందిద్దాం, మతస్వేచ్ఛ గురించి బోధిద్దాం.
మత సంస్కారం, పరమత సహనం అంటే ఏంటో ప్రపంచానికి నేర్పిన ఆధ్యాత్మిక శిఖరానికి పోపు గారు నీతులు చెబుతున్నారు.., ఎంత తెంపరితనం!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..