గురువారం 18 అక్టోబర్ 2012

నూతన రాష్ట్రీయ సమైక్యతా నందులు!

25 వ్యాఖ్యలు
ప్రధానిని కలిసేందుకు తెలంగాణ పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను రానివ్వలేదంట.. ప్రాంతాలకతీతంగా అందరూ దాన్ని ఖండించాలంట! బ్లాగులోనూ పత్రికల్లోనూ నినాదాలిస్తున్నారు. ’అత్యవసర సమైక్యత’ ఆవశ్యకత గురించి చాటింపేస్తున్నారు.

అసలు ఎందుకు రానివ్వలేదంటా? ఏం చేస్తారని భయపడ్డారంట? బహుశా పాత్రికేయుడి ముసుగులోని తెవాది ఏమైనా చేసెయ్యగలడని అనుకున్నారేమో.. పాత్రికేయులు రాజకీయ నాయకులపై చెప్పులు విసిరిన సంఘటనలను అక్కడక్కడా చూసారు గదా!

శుక్రవారం 11 నవంబర్ 2011

గూగులుకు తెలుగు నేర్పాలి మనం!

16 వ్యాఖ్యలు
తెలుగులో పదాలను వాక్యంలో ఇమిడ్చేటపుడు అవి రూపం కోల్పోతూ ఉంటాయి. సంధి జరిగి, సమాసం ఏర్పడినపుడు, బహువచనాలైనపుడు, విభక్తులు చేరినపుడు, .. ఇలా అనేక రకాలుగా పదాల రూపు మారుతూంటుంది. క్రియా రూపాలను బట్టి మారడం సరేసరి! ఇంగ్లీషులోనూ మారతాయిగానీ, తెలుగులో మారినంత ఎక్కువగా ఆ భాషలో జరగదు. పైగా ఇంగ్లీషులో జరిగే మార్పులు కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి జరుగుతాయి. ఆ నియమాలు కూడా తక్కువే. తెలుగులోనూ నియమాలున్నాయి గానీ, అవి చాలా ఎక్కువ.

శుక్రవారం 4 నవంబర్ 2011

సీబీఐ ని విచారించిన జగన్ !

3 వ్యాఖ్యలు
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు.

’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ, ఫలానా జీవో ప్రకారం ఆ భూములను ధారాదత్తం చేసారనీ అంచేత చంద్రబాబును కూడా విచారించాలనీ సీబీఐకి చెప్పాను’, అని పత్రికల వాళ్ళకు చెప్పాడు. ఆ జీవో కాపీలను కూడా పత్రికల వాళ్లకు ప్రదర్శించాడు.  ఇకనైనా చంద్రబాబును గుడ్డిగా సమర్ధించే ఎల్లో పత్రికలు బుద్ధి తెచ్చుకుని నిజాలు రాస్తారని ఆశిస్తున్నాను. అని కూడా అన్నాడు.

బుధవారం 2 నవంబర్ 2011

ఆ ద్రోహులు సూర్యుడిపై ఉమ్ముతున్నారు

10 వ్యాఖ్యలు
అబద్ధాలే పునాదిగా ఉద్యమం నిర్మించిన నాయకులు, అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుని ప్రజలను రెచ్చగొట్టిన నాయకులు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూంటారు. చరిత్ర వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తారు, లేదా తమకు అనుకూలమైన చరిత్రను తామే తయారుచేసుకుంటారు. అందులో తెవాదులు దిట్టలు. రాజకీయ దళారులు, రాజకీయ నాయకులు, ఉద్యమం పేరుతో డబ్బులు దండుకునే నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, పత్రికల సంపాదకులు, బూతుకవులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, కేటుగాళ్ళు,.. అందరిదీ ఇదే పద్ధతి!

మంగళవారం 1 నవంబర్ 2011

జయహో ఆంధ్రప్రదేశ్!

11 వ్యాఖ్యలు
దాదాపు నూట యాభై ఏళ్ళ వియోగం తరవాత 1956 నవంబరు 1 న తెలుగుజాతి తిరిగి ఏకమైంది. అభివృద్ధి పట్ల, జీవన పరిస్థితుల మెరుగుదల పట్లా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చడానికై  సమైక్య రాష్ట్రం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వాల్లో ఉండే అలసత్వం, నాయకులు, పాలకుల్లో ఉండే అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలు ఈ ప్రభుత్వాల్లోనూ ఉన్నాయి. ఈ అవకరాల గురించి చేసే విమర్శలు రోజూ మనం చదువుతూనే ఉన్నాం. వింటున్నాం. మనమూ రాస్తున్నాం. బ్లాగుల్లోను, ఇతర మీడియాలోను, ప్రజల్లోను, వివిధ వేదికల మీదా అనేక విమర్శలు వస్తున్నాయి.

సోమవారం 31 అక్టోబర్ 2011

గూగుల్ ప్లస్ బ్లాగర్ = " "

7 వ్యాఖ్యలు
గూగుల్ వాడు అనేక సేవలను తామర తంపర గా జనాల్లోకి దింపేస్తూంటాడు. మన జీమెయిల్లో పైన ఎడం చేతి పక్క నుండి వాడి సేవల జాబితా మొదలౌతుంది. జాబితా చివర ’మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే మరో సేవలజాబితా కిందకి జారుతుంది. దాని చివర ’ఈవెన్ మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే ఒక సేవల పేజీకి వెళ్తాం. ఇదివరకు ఆ పేజీనిండా బోలెడు సేవల జాబితా ఉండేది. వాటిలో ల్యాబ్స్ అని ఒకటుండేది.. అది నొక్కితే ఇంకా ప్రయోగ దశలో ఉన్న సేవల జాబితా ఇంకోటి ఉండేది. మొత్తం ఒక యాభైకి పైగానే ఉండేవి. ఇప్పుడు ఆ సేవల జాబితా బాగా చిక్కిపోయింది. అవన్నీ ఏమయ్యాయో తెలవదు.

సంబంధిత టపాలు