1, నవంబర్ 2006, బుధవారం

సోయం బాపూరావు అనగా రాజా జయచంద్ర

గత నవంబరులో తెరాసలో మొదటి తిరుగుబాటు జరిగినపుడు, అసంతుష్టుల జట్టులో మొదట సోయం బాపూరావు కూడా ఉన్నారు. అయితే తరువాత మాట మార్చి, మిగతా వారికి షాకిచ్చి, అసంతుష్టులపై పెద్ద పెద్ద ఆరోపణలు చేసారు. వాళ్ళు ముఖ్యమంత్రితో కుమ్మక్కయ్యారని, కేవీపీ రామచంద్రరావు నుండి డబ్బులు తీసుకున్నారని, తనకూ ఇవ్వజూపారని ఇలా బోలెడన్ని ఆరోపణలు చేసారు. వికీపీడియాలో ఈ పేజీలో నవంబరు విభాగంలో ఈయనగారి ఆరోపణలు చూడొచ్చు.

ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటుదారు అవతారమెత్తారు! అసలేం జరుగుతోంది? అప్పుడు కేవీపీ ఇచ్చిన డబ్బులు చాలక వెనక్కి వెళ్ళారా? లేక తెరాస మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటే తిరిగి వెనక్కి వెళ్ళారా? లేక ఇప్పుడు కాంగ్రెసు మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటే మళ్ళీ తిరుగుబాటు పాటందుకున్నారా?

ఆనాడు నారాయణరావు పటేల్, మందడి వంటి వారిని అప్రదిష్ట పాల్జేసేందుకు చేసిన కుట్రగానీ కాదుగదా, ఈయన ఆరోపణలు?

ఇలాంటి జయచంద్రులతో అందరూ జాగ్రత్తగా ఉండాలి - తెరాస అయినా కాంగ్రెసైనా! మనం మాత్రం మొత్తం రాజకీయులందరితోటీ జాగ్రత్తగా ఉండాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు