28, నవంబర్ 2013, గురువారం

మంత్రుల గుంపుకు నా ఉత్తరం

4 కామెంట్‌లు

శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా తయారైంది రాష్ట్ర విభజన. వాటిలో ఓ ఉపాయం మంత్రుల గుంపు. (మంత్రుల ’గుంపు’ అంటూంటే నవ్వొస్తోంది -నాన్నా.. మంత్రులే గుంపులు గుంపులుగా ఉంటారు. సోనియా మాత్రం ఒంటరిగానే ఉంటది).  ఈ గుంపు ఎన్ని దరిద్రాలను సృష్టించనుందో చూడాలి.

నా బుర్రకు తోచిన సూచనలను మెయిల్లో పెట్టి, గుంపుకు పంపేసాను. గడువు ఆఖరి రోజున కుసింత హడావుడిగా రాసి, సరిగ్గా ఐదింటికి రెణ్ణిమిషాల ముందు తోసేసాను మెయిల్ని. మన ఈమెయిళ్ళను చూసేంత తీరిక ఓపికా ఢిల్లీలో ఎవరికీ లేదని తెలిసినా ఏదో నా తుత్తి కోసం...

21, సెప్టెంబర్ 2013, శనివారం

ఐవీయార్ లో రాష్ట్ర విభజన

14 కామెంట్‌లు
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సులు (ఐవీయార్) ఎక్కడబడితే అక్కడ వినిపిస్తున్నాయి యిప్పుడు. అవును మరి.. ఈ ఐవీయార్లతో ఆయా సంస్థలకు గొప్ప ప్రయోజనా లున్నాయి మరి! ఫోను చేసేవాళ్ళకు మాత్రం ఐవీయార్లు నరకం చూపిస్తాయి. ఉదాహరణ కావాలంటే ఐసీఐసీఐ బ్యాంకుకు ఫోను చేసి చూడండి..తిక్క పుట్టకపోతే నన్నడగండి.  ఒకసారి ఫోను చేసిన వాడు మళ్ళీ ఫోను చెయ్యడానికి ధైర్యం చెయ్యడు -ఎక్కడో నాలాంటి మందులు, తోలుమందులూ తప్పించి.

19, సెప్టెంబర్ 2013, గురువారం

వీర శూర సీకాంగీసు నాయకులు

12 కామెంట్‌లు
తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన పరిస్థితి దాపురించిన సీకాంగీసు నాయకులు సోదియాను కలిసి విన్నవించుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె అపాయింటుమెంటు దొరకడం లేదు. అంచేత వాళ్ళు ఆమె సెక్రెటరీ ఇంటికి వెళ్ళి, ఆమెతో తమ గోడు చెప్పుకున్నారు. ఆ ’సెక్రెటరీ’ సోదియాకు వ్యక్తిగత సహాయకురాలు - అంటే తల్లో పేలు చూట్టం, కొబ్బరినూనె రాసి తలదువ్వడం -ఇట్టాంటి పన్లు చేస్తుందన్నమాట! ఆమెకు పాపం వీళ్ల మీద జాలి కలిగి ’సర్లే, రేపు డ్యూటీకి వెళ్ళినపుడు ఆమెతో మాట్టాడతాలే’ అని అభయమిచ్చింది. మరసటిరోజు సెక్రెటరీ సోదియాతో మాట్టాడుతోంది..

9, సెప్టెంబర్ 2013, సోమవారం

రౌడీలెవరు? హీరోలెవరు?

29 కామెంట్‌లు
నా గత టపాలో జై గొట్టిముక్కల గారు ఒకవ్యాఖ్య రాసారు "దెబ్బలు తిన్నోడు గూండాగా, కొట్టినోడు హీరోగా కనిపిస్తున్నాడా?" అని.  నా సమాధానం పెద్దదైపోవడంతో దాన్ని ఈ టపాగా రాస్తున్నాను.

7, సెప్టెంబర్ 2013, శనివారం

శభాష్ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులూ!

42 కామెంట్‌లు
శభాష్ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులూ!
- మహానాయకుల్లేరు. రెచ్చగొట్టే మాటల్లేవ్. వేదికపై బరువు కోసం తెచ్చుకునే వెడల్పాటి జాతీయ నాయకుల్లేరు. అక్కడున్నదల్లా ఉద్యోగులకు మాత్రమే తెలిసిన, వాళ్ల నాయకులు మాత్రమే.

4, సెప్టెంబర్ 2013, బుధవారం

సీమాంధ్ర ఉద్యమం, తెవాద ఉన్మాదం

63 కామెంట్‌లు
’పోండి, మీ రాష్ట్రాన్ని, మీ రాజధానినీ ఏర్పాటు చేసుకోండి, పోండవతలికి’ అని చివరికి అధికార పక్షం కూడా ప్రజలకు చెబితే, ఆ ప్రజలు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి?

18, అక్టోబర్ 2012, గురువారం

నూతన రాష్ట్రీయ సమైక్యతా నందులు!

25 కామెంట్‌లు
ప్రధానిని కలిసేందుకు తెలంగాణ పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను రానివ్వలేదంట.. ప్రాంతాలకతీతంగా అందరూ దాన్ని ఖండించాలంట! బ్లాగులోనూ పత్రికల్లోనూ నినాదాలిస్తున్నారు. ’అత్యవసర సమైక్యత’ ఆవశ్యకత గురించి చాటింపేస్తున్నారు.

అసలు ఎందుకు రానివ్వలేదంటా? ఏం చేస్తారని భయపడ్డారంట? బహుశా పాత్రికేయుడి ముసుగులోని తెవాది ఏమైనా చేసెయ్యగలడని అనుకున్నారేమో.. పాత్రికేయులు రాజకీయ నాయకులపై చెప్పులు విసిరిన సంఘటనలను అక్కడక్కడా చూసారు గదా!

11, నవంబర్ 2011, శుక్రవారం

గూగులుకు తెలుగు నేర్పాలి మనం!

13 కామెంట్‌లు
తెలుగులో పదాలను వాక్యంలో ఇమిడ్చేటపుడు అవి రూపం కోల్పోతూ ఉంటాయి. సంధి జరిగి, సమాసం ఏర్పడినపుడు, బహువచనాలైనపుడు, విభక్తులు చేరినపుడు, .. ఇలా అనేక రకాలుగా పదాల రూపు మారుతూంటుంది. క్రియా రూపాలను బట్టి మారడం సరేసరి! ఇంగ్లీషులోనూ మారతాయిగానీ, తెలుగులో మారినంత ఎక్కువగా ఆ భాషలో జరగదు. పైగా ఇంగ్లీషులో జరిగే మార్పులు కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి జరుగుతాయి. ఆ నియమాలు కూడా తక్కువే. తెలుగులోనూ నియమాలున్నాయి గానీ, అవి చాలా ఎక్కువ.

4, నవంబర్ 2011, శుక్రవారం

సీబీఐ ని విచారించిన జగన్ !

3 కామెంట్‌లు
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు.

’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ, ఫలానా జీవో ప్రకారం ఆ భూములను ధారాదత్తం చేసారనీ అంచేత చంద్రబాబును కూడా విచారించాలనీ సీబీఐకి చెప్పాను’, అని పత్రికల వాళ్ళకు చెప్పాడు. ఆ జీవో కాపీలను కూడా పత్రికల వాళ్లకు ప్రదర్శించాడు.  ఇకనైనా చంద్రబాబును గుడ్డిగా సమర్ధించే ఎల్లో పత్రికలు బుద్ధి తెచ్చుకుని నిజాలు రాస్తారని ఆశిస్తున్నాను. అని కూడా అన్నాడు.

2, నవంబర్ 2011, బుధవారం

ఆ ద్రోహులు సూర్యుడిపై ఉమ్ముతున్నారు

14 కామెంట్‌లు
అబద్ధాలే పునాదిగా ఉద్యమం నిర్మించిన నాయకులు, అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుని ప్రజలను రెచ్చగొట్టిన నాయకులు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూంటారు. చరిత్ర వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తారు, లేదా తమకు అనుకూలమైన చరిత్రను తామే తయారుచేసుకుంటారు. అందులో తెవాదులు దిట్టలు. రాజకీయ దళారులు, రాజకీయ నాయకులు, ఉద్యమం పేరుతో డబ్బులు దండుకునే నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, పత్రికల సంపాదకులు, బూతుకవులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, కేటుగాళ్ళు,.. అందరిదీ ఇదే పద్ధతి!

1, నవంబర్ 2011, మంగళవారం

జయహో ఆంధ్రప్రదేశ్!

11 కామెంట్‌లు
దాదాపు నూట యాభై ఏళ్ళ వియోగం తరవాత 1956 నవంబరు 1 న తెలుగుజాతి తిరిగి ఏకమైంది. అభివృద్ధి పట్ల, జీవన పరిస్థితుల మెరుగుదల పట్లా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చడానికై  సమైక్య రాష్ట్రం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వాల్లో ఉండే అలసత్వం, నాయకులు, పాలకుల్లో ఉండే అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలు ఈ ప్రభుత్వాల్లోనూ ఉన్నాయి. ఈ అవకరాల గురించి చేసే విమర్శలు రోజూ మనం చదువుతూనే ఉన్నాం. వింటున్నాం. మనమూ రాస్తున్నాం. బ్లాగుల్లోను, ఇతర మీడియాలోను, ప్రజల్లోను, వివిధ వేదికల మీదా అనేక విమర్శలు వస్తున్నాయి.

31, అక్టోబర్ 2011, సోమవారం

గూగుల్ ప్లస్ బ్లాగర్ = " "

7 కామెంట్‌లు
గూగుల్ వాడు అనేక సేవలను తామర తంపర గా జనాల్లోకి దింపేస్తూంటాడు. మన జీమెయిల్లో పైన ఎడం చేతి పక్క నుండి వాడి సేవల జాబితా మొదలౌతుంది. జాబితా చివర ’మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే మరో సేవలజాబితా కిందకి జారుతుంది. దాని చివర ’ఈవెన్ మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే ఒక సేవల పేజీకి వెళ్తాం. ఇదివరకు ఆ పేజీనిండా బోలెడు సేవల జాబితా ఉండేది. వాటిలో ల్యాబ్స్ అని ఒకటుండేది.. అది నొక్కితే ఇంకా ప్రయోగ దశలో ఉన్న సేవల జాబితా ఇంకోటి ఉండేది. మొత్తం ఒక యాభైకి పైగానే ఉండేవి. ఇప్పుడు ఆ సేవల జాబితా బాగా చిక్కిపోయింది. అవన్నీ ఏమయ్యాయో తెలవదు.

30, అక్టోబర్ 2011, ఆదివారం

బ్లాగుల / సంకలినుల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఎలా?

8 కామెంట్‌లు
మొన్న నేను బ్లాగరులో ఒక చిన్న పొరపాటు పని చేసాను. వేద్దామనుకున్న టపాతో పాటుగా, చిత్తుప్రతుల్లో ఉన్న మరో టపాను - ఇప్పుడప్పుడే వెయ్యదలచుకోనిది-  కూడా ప్రచురించేసాను. అనుకోకుండా జరిగింది. అడెడె.. అనుకుని వెనువెంటనే, దాదాపు అరనిముషం లోపే, దాన్ని ’అ’ప్రచురించేసాను, తిరిగి చిత్తుప్రతుల్లోకి పంపేసాను. ఎందుకైనా మంచిదని హారానికి వెళ్ళి చూసాను. అక్కడ చూపించలేదు. మాలిక లోనూ చూసాను, అక్కడా లేదు. కూడలిలోను, జల్లెడలోనూ రాలేదు.

28, అక్టోబర్ 2011, శుక్రవారం

ఇభరాముడు, మల్కిభరాము

15 కామెంట్‌లు
నమస్తే తెలంగాణ పత్రికలో ప్రాణహిత అనే శీర్షికలో అల్లం నారాయణ గారు ఇలా రాసారు:

"ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం చూసేదాకా ‘ఇబు రాముడు’ అని తెలంగాణవూపజలు ఇబ్రహీమ్ కుతుబ్‌షాను పిలుచుకునే వారని కూడా తెలియదు. తెలంగాణలో ఆయన తెలుగు భాషను ప్రోత్సహించినారన్న విషయమూ తెలియదు. సురవరం ప్రతాప్‌డ్డి అన్నట్టు ‘మనమూ చరివూతకు ఎక్కదగినవారమే’ అనీ తెలియదు. ఎందువల్ల. మనం చరివూతకు ఎక్కలేదు కను క."

25, అక్టోబర్ 2011, మంగళవారం

నిర్హేతుక నిరర్థక నిష్ఫల సమ్మె

6 కామెంట్‌లు
ప్రభుత్వ ఉద్యోగులు 40 రోజుల పైగా చేసిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. తెలంగాణ కోసం చేస్తున్నామని మొదలుపెట్టి, ముగింపు ఒప్పందంలో దాన్ని పెద్దగా పట్టించుకోకుండానే సమ్మెను ముగించేసారు. ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు చేసుకు పోయారో, ఎందుకు విరమించారో చూస్తే, ఇదంతా ఒక అయోమయ వ్యవహారంగా కనబడుతుంది.

24, అక్టోబర్ 2011, సోమవారం

విద్రోహ దినం కాదు, ద్రోహుల దినం చెయ్యాలి

4 కామెంట్‌లు
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని - నవంబరు ఒకటిని - విద్రోహ దినంగా జరుపుకోవాలని కోదండరామ్ పిలుపునిచ్చాడు. ఉద్యమం పేరిట ప్రజల జీవితాలతో చెలగాటాలాడుకుంటూ, కాలక్షేపం చేస్తున్న ఈయన, ఇపుడో కొత్త కార్యక్రమానికి తెర లేపబోతున్నాడు. విద్రోహ దినంతో పాటు, మూడురోజుల పాటు దీక్ష కూడా జరుపుకోవాలని ఫత్వా జారీ చేసాడు. దీక్ష చేసేందుకు అర్హతలేమిటో కూడా జారీ చేసారు సారు!

కానీ, ఇప్పుడు జరుపుకోవాల్సింది విద్రోహదినం కాదు, ద్రోహుల దినం. ఇది విద్రోహ దినం ఎందుక్కాదంటే..

21, అక్టోబర్ 2011, శుక్రవారం

గెలిచినవాడు నీచ మానవుడు

7 కామెంట్‌లు
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది.

15, అక్టోబర్ 2011, శనివారం

సకల జనుల సమ్మె లో తొలి విరమణ

13 కామెంట్‌లు
తెలంగాణ ఉద్యమంలో 2011 అక్టోబరు 15 ఒక గుర్తుంచుకోదగ్గ రోజు. అనేక సంఘటనలు కలగలిసి ఈ రోజుకు ప్రాముఖ్యత తీసుకొచ్చాయి. ముఖ్యంగా రెండు సంఘటనల గురించి చెప్పుకోవాలి:

12, అక్టోబర్ 2011, బుధవారం

కాలుష్య కారకుడు, కేసీఆర్

48 కామెంట్‌లు
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కెసిఅర్ కో ప్రత్యేకత ఉంది.. అనేక విషపు మాటలు మాట్టాడి ప్రజల మనసులను కలుషితం చేస్తూ ఉద్యమాన్ని ఎగదోస్తూంటాడు. పైగా తాను సరిగ్గా మాట్టాడుతున్నట్టూ, అవతలి వాళ్ళు తప్పుగా మాట్టాడినట్టూ ప్రచారం చేస్తూంటాడు. ఇది అతడికి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి దాన్ని చాలా బాగా వాడాడు.

ఈ మధ్య కాలంలో అతడేమన్నాడో చూడండి:

3, అక్టోబర్ 2011, సోమవారం

ప్రజలపై తెవాదుల రాళ్లదాడులు

28 కామెంట్‌లు
సకల జనుల సమ్మె పేరుతో మొదలైన సమ్మె ఇవ్వాళ రాళ్ళదాడికి చేరింది. విజయవాడ నుంచి హై. కు వస్తున్న బస్సులపై తెవాద మూకలు రాళ్ళేసి కొట్టాయి.పదికి పైగా బస్సుల అద్దాలు పగిలాయి. ప్రయాణీకులకు కూడా రాళ్ళ దెబ్బలు తగిలాయి. తెల్లారేటప్పటికి హై. చేరుకోవాల్సిన ప్రజలు మధ్యాహ్నం తరవాత చేరుకున్నారు. ఉద్యమాన్ని "మిలిటెంటు అహింస" వైపు  నడవమని తమ నాయకుడు కోదండరామ్ చెప్పాడు గదా.. ఇట్టాగే ఉంటాయి వాళ్ళ చేతలు!

సంబంధిత టపాలు