1, సెప్టెంబర్ 2006, శుక్రవారం

భేష్, రాష్ట్ర ప్రభుత్వం

మేకల రాజ్యలక్ష్మి! కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక. ఎమ్సెట్ పరీక్షలో ర్యాంకు తెచ్చుకుని, మెడికల్ కాలేజీలో సీటూ పొందింది. దురదృష్టం.. అంత చదువులు చదివే ఆర్థిక తాహతు లేదీమెకు. (ఒకరోజు టీవీలో చూపించారు, ఆమె పొలంలో పనిచేసుకుంటూండగా!) సీటు కోసం తపించే వాళ్ళు, సీటు రాక లక్షలూ కోట్లూ పోసి చదివే వాళ్ళు, చైనాలు, జపానులూ వెళ్ళి మరీ చదువుకునే వాళ్ళు ఉన్న కాలమిది. మన రాష్ట్రంలోనే సీటొచ్చీ.., చేరలేని నిస్సహాయత తలుచుకుంటే ఏ సంబంధమూ లేని మనలాంటి వారికి కూడా ఉసూరనిపించక మానదు. అలాంటిది, ఇక ఆమె వేదన ఊహించరానిదేమీ కాదు.

సరైన సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆదుకుంది. "
ఆమె డాక్టర్‌ కావాల్సిందే. స్టెతస్కోప్‌ పట్టాల్సిందే. ఆమె సేవలు సమాజానికి ఉపయోగపడాల్సిందే'" అని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారట. ఆమెలాంటి వారికి సహాయం అందించేందుకు ఏదో పథకాన్ని కూడా తయారు చేస్తారట.

ఇంత మంచి పని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు