శాసనసభలో తెలుగుదేశం పార్టీవాళ్ళు "వయ్యెస్సార్ దొంగలముఠా" అంటూ ప్లకార్డులు చూపించారంట. అందుకు కోపించిన వయ్యెస్సార్ అనుయాయులు (వారిలో మంత్రులు కూడా ఉన్నారంట) తెదేపా సభ్యులను పట్టుకుని కొట్టేసారంట.
కొట్టేటప్పుడు ఏమని అన్నారో తెలీటంలేదుగానీ, ఇలా అని ఉండొచ్చని నా ఫ్రెండొకడు అన్నాడు -"ఏరా ఉత్త దొంగల ముఠాయేననుకుంటన్నావా.., మేం రౌడీ ముఠా కూడారోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని ప్రవర్తించు"
...............
జాగర్త శాసనసభ్యులారా పోయినోడు హిరణ్యాక్షుడైతే, ఉన్నోళ్ళు హిరణ్యకశిపులు, జరాసంధులు, బకాసురులు!
28, మార్చి 2011, సోమవారం
20, మార్చి 2011, ఆదివారం
ఇదిగో.. ఆ చిరంజీవిని ఢిల్లీకి రమ్మనమని కబురెట్టమని కబురెట్టవోయ్
రాబోయే రోజుల్లో మనం చూడబోయే వార్తల్లో ఈ కిందిదో దీని లాంటిదో ఉండొచ్చని నా ఊహ.
హైదరాబాదు, రేపటి వార్త
ప్రముఖ కాంగ్రెసు నాయకుడు చిరంజీవిని వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానుడు కబురు పెట్టించారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. అదృష్టం కలిసొస్తే, ఆయన మేడమ్మను కూడా కలవొచ్చని తెలుస్తోంది.
------------------------------------
"చిరంజీవి గారూ ఒక్ఖసారి ఢిల్లీకి వచ్చిపోరూ.. ప్లీజ్!" - అధిష్ఠానంహైదరాబాదు, రేపటి వార్త
ప్రముఖ కాంగ్రెసు నాయకుడు చిరంజీవిని వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానుడు కబురు పెట్టించారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. అదృష్టం కలిసొస్తే, ఆయన మేడమ్మను కూడా కలవొచ్చని తెలుస్తోంది.
12, మార్చి 2011, శనివారం
విగ్రహాలను కూలుస్తున్న ముష్కరులెవరు?
విగ్రహాలను కూల్చింది ఎవరో మాకు తెలవదు అన్నారు. అదంతా సీమాంధ్రుల కుట్ర అని చెప్పారు. ఆ విగ్రహాల స్థానంలో తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్లు చేసారు. మార్చికి అనుమతినిచ్చి ఉంటే ఈ విధ్వంసం జరిగి ఉండేది కాదంటూ చెప్పుకొచ్చారు. తెవాద నాయకులు ఎలా మాట్టాడ్డానికైనా సమర్ధులే! ఇవ్వాళ టీవీ 9 లో వచ్చిన వార్త చూసాక వీళ్ళు ఏం చెయ్యడానికైనా సమర్ధులేనని తెల్లమైంది.
10, మార్చి 2011, గురువారం
ప్రజాస్వామిక రౌడీయిజం
’ఇది ప్రజాస్వామిక , అహింసాయుత ఉద్యమం. మేమెంతో ప్రజాస్వామికంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. పోలీసులు, ప్రభుత్వం మమ్మల్ని అప్రజాస్వామికంగా అణచివేస్తున్నారు’ అంటూ తెవాద నాయకులు గోల పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇవ్వాళ చేపట్టిన మిలియన్ మార్చి కూడా ఎంతో చక్కగా, కనీవినీ ఎరగనంత ప్రజాస్వామికంగా జరిగింది.
17, ఫిబ్రవరి 2011, గురువారం
గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!
గవర్నరు గారూ,
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
శాసనసభ వద్ద రౌడీలు
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..