18, అక్టోబర్ 2012, గురువారం

నూతన రాష్ట్రీయ సమైక్యతా నందులు!

ప్రధానిని కలిసేందుకు తెలంగాణ పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను రానివ్వలేదంట.. ప్రాంతాలకతీతంగా అందరూ దాన్ని ఖండించాలంట! బ్లాగులోనూ పత్రికల్లోనూ నినాదాలిస్తున్నారు. ’అత్యవసర సమైక్యత’ ఆవశ్యకత గురించి చాటింపేస్తున్నారు.

అసలు ఎందుకు రానివ్వలేదంటా? ఏం చేస్తారని భయపడ్డారంట? బహుశా పాత్రికేయుడి ముసుగులోని తెవాది ఏమైనా చేసెయ్యగలడని అనుకున్నారేమో.. పాత్రికేయులు రాజకీయ నాయకులపై చెప్పులు విసిరిన సంఘటనలను అక్కడక్కడా చూసారు గదా!
ఇక్కడా వీళ్ళు అదేపని చేస్తారని అనుకున్నారేమో!

విద్యార్థులు చేసిన అల్లరిని వాళ్ళు చూసారు గదా! లాయర్లు చేసిన బీభత్సాలూ చూసారు. జయప్రకాశ్ నారాయణపై జరిపిన దాడిని చూసారు. మిలియన్ మార్చి, ఆ తరవాత ముప్పైవేల మార్చీ.. వాటిలో జరిగిన విధ్వంసాలూ చూసారు. ఆ వరసలోనే ఇప్పుడు ఈ పాత్రికేయులు కూడా ప్రొఫెసరు గారు చెప్పిన మిలిటెంటు అహింస ఏదైనా చేస్తారేమోనని భయపడ్డారేమో!

ఎందుకన్నా కానీండి, మొత్తమ్మీద రానివ్వలేదు. కానీ ఆ సంఘటన తరవాత కొన్ని విచిత్రాలు జరిగాయి. దయ్యాలు వేదాలు వల్లించడం లాంటి చిత్రాలే ఇవి కూడా! ఓ రెండిటి గురించి ఇక్కడ..

ఈ సంఘటన పట్ల బ్లాగుల్లో పాపం బాధపడిపోయారు. దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. ప్రాంతాలకతీతంగా యమర్జెంటుగా అందరం కలిసిపోయి, బూతుకూతలన్నిటినీ స్విచ్చాఫు చేసినట్టు ఠకీమని మర్చిపోయి నిరసన తెలపాలంట. అబ్బ, ఎంత సమైక్యతా భావనో!! అత్యద్భుతమైన జాతీయ సమైక్యతను తెరపై పరచినందుకు గాను లై బోలో తెలంగాణకు నందిని దానం చేసినట్టు, ఇక్కడ కూడా "ఉత్తమ రాష్ట్రీయ సమైక్యత బ్లాగులు" అని ఒక నందిని ఇచ్చేస్తా. అదే ఊపులో ఆ బ్లాగరులకు మద్దతుగా నేనూ కుసింత దిగ్భ్రాంతిని నా వంతుగా వెళ్లగక్కుతా!

అదే కొలతన "ఉత్తమ రాష్ట్రీయ సమైక్యతా పత్రిక" పురస్కారం దక్కాల్సిన పత్రికొకటుంది మనకు -’నమస్తే అల్లం’!


తెలంగాణ నారాయణ గారి ’నమస్తే అల్లం’ పత్రికలోని సంపాదకీయం కూడా భలే బాగుంది, మసాలా బాగా కూరారు. ఎటొచ్చీ చివర్లోని అప్పుతెచ్చుకున్న అల్లం కుసింత ఎక్కువైందనిపించింది. నమస్తేలో రాతలన్నీ పక్షపాతపు వాతం చేసినవే, ప్రాంతీయ విద్వేషపు గబ్బు కొట్టేవే! అలా విషపు రాతలు రాసేటపుడు అందరం ఒకటేనన్న సంగతి గుర్తుకు రాలేదు వారికి. కానీ ప్రధానిని కలవనీయనపుడు మాత్రం  ’అందరం ఒక్కటే! అందరూ కలిసి ఎదుర్కోవాలె!’  అని ఉద్బోధిస్తున్నారు. మళ్ళీ దాని పక్క పేజీ నుంచి తప్పుడు రాతలు మాత్రం.. షరా మామూలే! ఆహా.. ఏమి నీతి అల్లం వారిది! అయినా సరే, ఆ పత్రిక్కీ ఒక సమైక్యతా నందినందించేసి, నమస్తే పెట్టేస్తా. పన్లోపని, ఓ గుక్కెడు దిగ్భ్రాంతి వాళ్ళక్కూడా!
-------------------
’వాళ్ళు వాడి కోసం, వీడి కోసం వచ్చినపుడు మూసుకుని కూర్చుంటే, చివరికి నా కోసం వచ్చినపుడు పలకరించే వాడే లేకుండా పోయాడు’ - ఇదీ నమస్తే వారు కూరిన అల్లం. ఈ కతనే మన నూతన సమైక్యతా వాదులంతా మూకుమ్మడిగా వినిపిస్తున్నారు. ఈ కథ వీళ్ళకేనా తెలిసింది? ప్రభుత్వానికి మాత్రం తెలీదూ..? తెలుసు! అందుకే ఇదిగో, ఇలా అనుకుని ఉంటారు.

మొదట ఉస్మానియాలో అల్లరి మొదలుపెట్టారు
పర్లేదులే, కుర్రాళ్ళ చదువులేగా పోయేది అని మాట్టాడలేదు

తర్వాత కోర్టుల దాకా వచ్చారు
సర్లే, కోర్టులేగా పని నష్టపోయేది అని నోరు తెరవలేదు

తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోకి జేపీ కోసం వచ్చారు
పోన్లే, జేపీనేగదా కొట్టింది అని పట్టించుకోలేదు

తర్వాత వాళ్లు ట్యాంకు బండు విగ్రహాల కోసం వచ్చారు
పోయినవి విగ్రహాలే కదా అని గొంతెత్తలేదు

చివరకు వాళ్లు నా కోసం వద్దామనుకున్నారు
(రానిస్తే ఏం చేస్తారో నాకు తెలుసు, అందుకే..)
నేను వాళ్లను రానివ్వలేదు.
------------------------
దట్సాల్!

25 కామెంట్‌లు:

  1. :) చాన్నాళ్ళకు కనిపించారు.

    అలా...
    నిగ్గ దీసి అడుగు
    ఈ సిగ్గులేని తెలగాన్లని
    ఈ రాష్ట్ర జీవచ్చవాల్ని

    రిప్లయితొలగించండి
  2. చివరకు వాళ్లు నా కోసం వద్దామనుకున్నారు
    (రానిస్తే ఏం చేస్తారో నాకు తెలుసు, అందుకే..)
    -------------------------
    ఇది మాత్రం ultimate అండి :-)

    రిప్లయితొలగించండి
  3. చివరకు వాళ్లు నా కోసం వద్దామనుకున్నారు
    (రానిస్తే ఏం చేస్తారో నాకు తెలుసు, అందుకే..)
    నేను వాళ్లను రానివ్వలేదు.

    :D

    రిప్లయితొలగించండి
  4. ఓ పెద్దాయన అంటాడు తెలంగాణా ఎక్కడుందని? ఆయనే మళ్ళీ అంటాడు ప్రపంచంలో ఇదొక్కటే సమస్యా అని! అసలు తెలంగాణా గురించి ఏమీ మాట్లాడ లేదు అని గూడా అన్నాడు.అయినా దసరాకు తెలంగాణా రావడం తప్పదు అంటారు.అమాయకులా? అతి తెలివి వాళ్ళా?

    రిప్లయితొలగించండి
  5. మీరు ఇచ్చిన నందిని పుచ్చుకుని కూడా విచ్చలవిడిగా ఎలా వాగుతున్నాడో చూశారా ఆ బ్లాగు పెద్దమనిషి. గవర్నమెంట్ ఇచ్చిన నందిని తీసుకుని ఆ శరత్ కూడ నిన్న మెగా సినిమా గురించి, పవర్ స్టార్ గురించి, పూరీ గురించి అవ్వాకులు చెవ్వాకులు పేలాడు. ఈ తెలంగాణ వాళ్లకు నందులు ఇచ్చి వాళ్లను మంచి చేసుకుందామని మీరు, గవర్నమెంటు చూశారు. కాని వాళ్లు మంచి అవడం లేదు. :) చేరి మూర్కుల మనస్సు రంజింపరాదు.

    రిప్లయితొలగించండి
  6. SNKR, Sravya Vattikuti, Indian Minerva, tarakaM: నెనరులు. :)

    అజ్ఞాత20 అక్టోబర్ 2012 6:47:00 ఉ IST: చూసానండి. తెవాదుల దివాలాకోరు సంస్కారం అది.

    1. జనం అమాకయకంగా వింటున్నపుడు లేనిపోని అబద్ధాలన్నీ కలిపి కిచిడీ చేసి చెప్పు
    2. వాళ్ళు ఎదురు తిరిగి ఇదేంటని అడిగితే బూతులు తిట్టు
    3. సిద్ధాంతం లేకపోతే రాద్ద్ధాంతం చెయ్యి
    4. రాద్ధాంతం చేసే అవకాశం దొరక్కపోతే, రండి సమైక్యంగా గొడవ చేద్దాం అని సమైక్యతా సుద్ద్దులు చెప్పు
    5. ఏడిశావులే, నీ వగలమారి కబుర్లు ఆపు అని జనం అన్నపుడు తిరిగి పాయింటు #1 దగ్గర మొదలుపెట్టు.
    ఇదీ తెవాదం -బ్లాగైనా పత్రికైనా మరేదైనా!

    జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు దొరికితే లాగి పడెయ్యడం, నడుం కింద కొట్టడం, దొంగ దెబ్బలు తీయడం, చీకట్లో మాటేసి వేటు వెయ్యడం, విగ్రహాలు పడగొట్టి ఆంద్రోళ్ళే చేసారని బుకాయించడం, అబద్ధాలు ప్రచారం చెయ్యడం -ఇవన్నీ వాళ్ళ ట్రేడ్ మార్కులు. ఉద్యమం వాళ్ళ ట్రేడ్! ఆ వ్యాపారానికి నమస్తే అల్లం, బ్లాగులు, జాకులు వగైరాలు ప్రచార సాధనాలు. బూతులు వాళ్ళ ట్రేడ్ కు గుర్తింపు నిచ్చే టింగిల్స్. మామూలు వ్యాపారస్తులు చెయ్యలేనిది, తెవాదులు చేసేదీ ఏంటంటే.. ఎక్స్టార్షన్! సినిమాల వాళ్ళు, పరిశ్రమల వాళ్ళూ దీని బాధితులు. కెమెరామన్ రాంబాబు ఇట్టీవలి బాధితుడు.

    పోతే, పవన్ కళ్యాణ్ ను, పూరి జగన్నాథ్ నూ తిట్టిన ఆ నంది దర్శకుడి పేరు శంకరండి, శరత్ కాదు. అవార్డులు ఎలా వస్తాయో బాగా తెలిసిన వ్యక్తి ఆయన. జాతీయ అవార్డు స్క్రీనింగు కమిటీలోనో మరోచోటో తాను ఉండగా సుద్దాల అశోక్ తేజకు అవార్డు ఇప్పించాను అని చెప్పుకున్నాడతడు. అవార్డులు ఎలా ఇస్తారో, ఎలా ఇప్పిస్తారో బాగా తెలిసినట్టే ఉంది ఆయనకు.

    "చేరి మూర్కుల మనస్సు రంజింపరాదు." - :) ఔను!

    రిప్లయితొలగించండి
  7. ప్రజల చేతిలో ఉద్యమం ఉందంట , ఇంత కన్నా వేరే జోక్ ఏమి ఉండదు.
    ప్రజలని వెర్రి వాళ్ళు చేసి ఆడుకుంటున్నారు అనడానికి అతి పెద్ద ఉదాహరణ రాంబాబు సినిమానే. ఆ మూవీ 18న రిలీజ్ అయింది. ఆ రోజు ఎవ్వరు ఏమి మాట్లాడలేదు. 19 న నమస్తే తెలంగాణా లో న్యూస్ రాగానే మన ఉస్మానియా అంకుల్స్ ఊర కుక్కల్ల జనాల మీద, ఆఫీసుల మీద పడి వాళ్ళకే చేతనైన, వాళ్ళకి ఇష్టమైన దారిలో రభస చేసి వెళ్ళిపోయారు. నిజంగా ప్రజల చేతిలో ఉద్యమం ఉంటె , 18 నే జనాలు నిరసనలు వ్యక్తం చేసేవాళ్ళు. ప్చ్ ఆ రోజు ఒక్కడు కూడా మాట్లాడలేదు. లగడపాటి చెప్పింది కరెక్ట్. ఉస్మానియా మూసేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. ఇది కిరాయిభావాలతో, కిరాయి మనుషులతో, కిరాయిరాతలతో, కిరాయిపాటలతో, కిరాయిడబ్బులతో నడుస్తున్న ఉద్యమం. దీని వెనక కాంగ్రెస్ ఉంది. వాళ్ళకి TRS ముందుపెట్టుకున్న ఒక శిఖండి మాత్రమే. తోటి తెలుగువారి మీద విషం క్రక్కే వేర్పాటువాద సినిమాలకి జాతీయసమైక్యతానందులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. హిట్లర్ కి నోబెల్ శాంతిబహుమతి ఇచ్చినా మనకింత అసహ్యం కలగదు. కాంగ్రెస్ అక్కడా ఇక్కడా కూడా ఓడిపోయాక ఈ ఉద్యమం ఎటు పోయిందో కూడా తెలీని విధంగా అజా పజా లేకుండా పోతుంది.

    రిప్లయితొలగించండి
  9. ANDHRA DOPIDI DONGALA KULLU E ROOPUMLO BAYATAPADUTHUNDHI...DOCHUKUNE TATVAM NUNDI BAYATA PADI..MANUSULLAGAA JEEVINCHANDI

    రిప్లయితొలగించండి
  10. ANDHRA DOIPIDI DONAGALA KAPATI TATVAANIKI NIDARSHANAM..INKA EMI DOCHUKOVALANO..CHEE POMANNAA..INKA NAKAUTHUNE VUNTARU...HAHAHA.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోనియా 100మార్లు చీపురు తిరగేసి ఇచ్చినా ఇచ్చేది అమ్మే అంటారు, అదేమి సిగ్గులేని జాతో. హీ హీ హి

      తొలగించండి
  11. మీరు టపాలు రాయటం లేదని అలిగి మీ బ్లాగ్ చూడటం మానేసా అందువల్ల మీ టపా చూడటం కాస్త లేటయింది. టపా బాగుంది.

    కాముధ

    రిప్లయితొలగించండి
  12. హ హ హ..ఆంధ్ర దోపిడీ దొంగలంట. ఇది అతి పెద్ద జోక్. ప్రతీ ఒక్కడకి ఇది ఒక అలవాటు అయిపోయింది, దోపిడీ చేసేస్తున్నామని ఏడవడం.
    హైదరాబాద్ లో ఉండే హక్కు ప్రతీ ఒక్కడకి ఉంది.వాడు ఆంధ్ర వాడైన, తమిళ్ వాడైన, కన్నడ వాడైన. అలాగే ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కడు వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు లలో వ్యాపారం చేసుకునే వాళ్ళలో వివిధ ప్రాంతాల వాళ్లని చూడచ్చు. ఏదో హైదరాబాద్ వీళ్ళ సొంతదైనట్టు, వీళ్ళ తాతలు కట్టించారు మరి. ఆ శాడిస్ట్ నిజాం గాడు వాడి ఉంపుడుగత్తెలకి కట్టించుకున్న భవనాలు చూపించి మావి మావి అని ఎగరడం, వాడు ఉన్నప్పుడు అన్ని మూసుకుని హైదరాబాద్ లోకి రావడానికే భయపద్దవాళ్ళు, ఇప్పుడేమో అది మాదే, ఇది మాదే , అటు నేనే, ఇటు నేనే అంటూ అరుస్తున్నారు. నగ్నంగా బతుకమ్మ ఆడించిన వాడు ఇప్పుడు దేవుడైపోయాడు, వాడి ఉంచుకున్న వాళ్ళకోసం కట్టించుకున్న బిల్డింగ్లు , వాడి తోకల కోసం కట్టించిన ఆసుపత్రులు ఇప్పుడు పుణ్య క్షేత్రాలు అయిపోయి వీళ్ళకి. వీళ్ళ చర్మం వలసి పన్నులు వసూలుచేసిన నిజాం ఇప్పుడు పుజ్యనీయుడు. హైదరాబాద్ దాటి ఒక్క స్కూల్ కట్టించలేదు,ఒక ఆసుపత్రి కట్టించలేదు, న్యూస్ లో చుస్తే వాడే అతి పెద్ద కోటీశ్వరుడు.
    వీళ్ళు ఊరిలో రోడ్ వేయకపోతే అది ఆంధ్ర వాడి తప్పు, వీళ్ళ ఊరిలో నీళ్ళు రాకపోతే అది ఆంధ్ర వాడి తప్పు, వీళ్ళ ఊళ్ళో కరెంట్ లేకపోతె అది ఆంధ్ర వాడి తప్పు,ఇంకోటి చెప్తే బాగోదులే ... అంతే కాని MLA, MP లు ఏం చేస్తున్నారో ఒక్కడు కూడా ఆలోచించడు, వాళ్ళేమో దొబ్బి తిని, వీళ్ళని ఉసిగొల్పడం, వీళ్లేమో పోలో మంటూ జనాల మీద పడి ఏడవడం.
    వీళ్ళు చేసే పనులు చూడాలంటే ఉస్మానియా అంకుల్స్ ని చూడాలి, వీళ్ళు మాట్లాడే బూతులు చూడాలంటే నమస్తే తెలంగాణా చూడాలి.

    రిప్లయితొలగించండి
  13. ఈ సంగటన గురించి బ్లాగులోకం లో ప్రముఖ మైనారిటివాద కవి అంతరీక్షబాబా గారు ఏమైనా వ్యాఖ్యానించారా? వారా మధ్య హైదరాబాద్లో జరిగిన ఊరేగింపులో పాల్గొని, ప్రభుత్వ నిర్భందం పైన నిప్పులు కక్కుతూ తన బ్లాగులో ఉద్యమ ఫర్నెస్ అక్షర రూపంలో రాజేశారు. తమాషా ఏమిటంటే ముస్లింలకు ఈ తెలంగాణా ఉద్యమం మీద పెద్ద ఆసక్తి లేకపోయినా, వారిని అదే పని గా గోకి, దానిలో చెరమని ఆహ్వానించి పెద్దరికం ఆపాదించటం తెరాస చేస్తుంటే. ఇదే ఫార్ములని తెలుగువెలుగు పేపర్ యజమాన్యం అమలు చేస్తున్నాది. ఈ అంతరీక్షబాబా ని మైనారిటిల తరపున గొప్ప మేధావి అయినట్లు ఆయనని ప్రొజేక్ట్ చేయటం. ఆయన ఇంతలోనే తెలంగాణా తెహజీబ్ ఎలా ఆంధ్రుల వల్ల నాశానమైందో అసత్యపు వ్యాసాలు బ్లాగులో రాయటం. ప్రశ్నిస్తే జవాబు ఇవ్వన్ని ఏకైక రచయిత ఆయనొక్కడినే చూడోచ్చు. ఇతని తప్పే కాదు, ఆపేపర్ నడిపే వారి తప్పుకూడా చాలా ఉన్నాది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైనారిటీ కార్డ్ అంతరిక్ష బాబా ఒవైసీలతో తెలంగాణాకు అనుకూలంగా ఒప్పిస్తాడు, జై తెలంగాణ అనిపిస్తాడు. లేదంటే డిసెంబర్లోగా చార్మినార్ ముందు అమరుడైపోతాడు, చూస్తూండండి.

      తొలగించండి
  14. సన్నగా, పొట్టిగా, ఉర్దు పదలాను (జగ్ నే కి రాత్,అధురే అంట్టూ) తెలుగులో రాసే ఆయనని, షేర్వాని ధరించి,అస్తిత్వం కోసం ఉర్దూ,ఇంగ్లీష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ పార్టి అధికారంలో ఉంటే దానికి చిడతలు వాయిస్తు మాంచి ఒడ్డు పొడుగు ఉండే ఒవైసీ ఇతనిని హిందువుగా పరిగణిస్తాడని మీకు తెలిసినట్లు లేదు. ఈ పెద్దాయనని స్రీ, దళిత సాహిత్య రచయితలు తప్పించి ఎవ్వరు పట్టించుకోరు. ఐతే ఈ యన పెద్ద పోరాట యోధుడిలా తెలంగాణా మార్చ్ ని ప్రభుత్వం అణచివేసిందని రాస్తాడు. ఆ రోజు అంతమంది జనం ఒక చోట గుమిగూడితే పోలిసులు అదుపుచేయకుంటే, తొక్కిసలాటో, దొమ్మీనో, లేక ఇంకేదైనా పెద్దగలాట జరిగి ప్రజల ప్రాణలు పోతే మమ్మల్ని కాల్చి చంపారు అంట్టూ, తెలంగాణ బిడ్డలు అమర వీరులు,వారి త్యాగాలు అంట్టు ఎవో కథలు రాద్దామనుకొని పోయినట్లు ఉన్నాడు. పోలీసులు అటువంటి దుసంఘటనలు జరగకుండా మార్చ్ లో పాల్గొన్న ప్రజలను క్షేమంగా ఇంటికి చేరే ఏర్పాటు చేస్తే ఈయన గారి కలం ఊరుకోకుండా తినింట్టి వాసాలు లెక్కిస్తూ పోలిసోళ్లను, ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి నిందిస్తూ రాశాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్రా కోటాలో తేరగా హాజ్ యాత్రకు గవర్నమెంట్ టికెట్ వుందని చెప్పండి, మీ చెప్పులు మోయగలడు.

      తొలగించండి
  15. తెలంగాణ నారాయణ గారి ’నమస్తే అల్లం’ == ఇది బలే బాగుంది. ఇబ్బురాముడి విషయంలో అల్లం గారి తెలివితక్కువతనాన్ని బాగా బయత పెట్టారు.

    రిప్లయితొలగించండి
  16. ఉద్యమం వాళ్ళ ట్రేడ్! == జువెలరీ షాపుల వాళ్ళకు ధనతేరస్, అక్షయ త్రుతీయ ఉన్నట్లు, ఈ ఉద్యమకారులకు బోనాలు, బతుకమ్మలు ఉన్నాయి తమ వ్యాపారాన్ని పెంచుకోటానికి.

    రిప్లయితొలగించండి
  17. అవునండీ....ఈ గోల లో పడి రాష్ట్రం అంతా నాశనం అయిపొతొంది. అసలు ఈ సదరు తెలంగాణా వచ్చినా ఒక సామాన్యుడికి ఒరిగేదేంటొ నాకు అస్సలు అర్ధం కావడం లేదు.

    రిప్లయితొలగించండి
  18. ఈ దీపావళికి తెలంగాణా వస్తుంది కదా అప్పుడు చెపుతాం మీ అందరి పని, కాకపోతే సంక్రాంతికో, ఉగాదికో తెచ్చుకుంటాం, ఈ లోపు మీరందరూ మా దోపిడీకి సహకరించాలి. - శరత్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరకాసురలంతా మనోళ్ళే అని వూస్ మేనియా ఘోషిస్తోంది, దీపావళికి ఆడు చస్తాడు కదా! తెలగాన రావటమేమిటి?!
      ఉగాది కాకుంటే వచ్చే శివరాత్రికే.. సరేనా? :))

      తొలగించండి
  19. తెలంగాణా లోని జనాభా 2011జనాభాలెక్కల ప్రకారం అంతా కలిపి 3.00 కోట్లు దాటలేదు. అందులో కోస్తా, రాయలసీమలనుంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్లతో మరియూ జంటనగరాల్లోని జనాభాతో సహా. కానీ మన అల్లం నారాయణ లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 4.50 కోట్లుత. నేను దానిని ప్రశ్నిస్తే, రాసేటప్పుడు ఒకోసారి అలా రాయడం జరుగుతుంది అని జవాబు. ప్రస్తుత లెక్కల ప్రకారం అల్లం నారాయణని అడిగితె ఏ అయిదు కొట్లో ఆరు కొట్లో తెలంగాణా జనాభా అనే లెక్క చెబుతాడు. ఆయన చెప్పిందే ఈ తెలబానులకు భగవద్గీత.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు