5, జూన్ 2006, సోమవారం

వామపక్ష నాటకాలు

రాష్ట్ర శాసనసభల ఎన్నికలు అలా ఐపోయాయి.. ఇదిగో ఇలా పెట్రోలు రేట్లు పెంచేసారు. ముడి చమురు ధరలు తెగ పెరిగి పోతున్నాయి కాబట్టి ధరలు పెంచక తప్పని పరిస్థితి! ప్రభుత్వ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష బీజేపీ దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుంది.. అది సహజం.

అయితే, వామ పక్షాల నాటకం చూడండి. వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రేట్లు పెంచడం ఇష్టం లేకపోతే.., వీల్లేదని కరాఖండిగా ప్రభుత్వానికి చెప్పేయాలి. రేట్లు పెంచకుండా ఏంచెయ్యాలో కూడా చెప్పాలి. వినకపోతే మెడలు వంచి ఒప్పించాలి. ప్రభుత్వ మనుగడ వీళ్ళ మద్దతు పైనే ఆధారపడి ఉన్నపుడు ఎందుకు వినరు, చచ్చినట్లు వింటారు! ఆ పనులు చెయ్యకుండా.. ఉద్యమాలు చేస్తాం, బందులు చేస్తాం, ఆందోళనలు చేస్తాం అని ఈ అరుపులేమిటి? ఎవరిని అలరించేందుకు ఈ ప్రకటనలు?


రేట్లపెంపు నిజంగా అసమంజసమైతే.. "ప్రభుత్వాన్ని నిలదీయండి. యూ పీ ఏ లో కాంగ్రెసును కడిగేయండి. పెంపును రద్దు చేయించండి. లేదూ.. మాట్లాడకుండా కూర్చోండి. పెరిగిన రేట్లకు ఎలాగూ అలవాటు పడతాం. మళ్ళీ బందులనీ, ఉద్యమాలనీ మమ్మల్ని బాదకండి."


ఒక వేళ.., "మీరు రేట్లు పెంచండి, మేం ఆందోళన చేస్తాం, అపుడు, పెంచిన దానిలో కొంత తగ్గించండి " అని కాంగ్రెసుతో ఒప్పందానికి గానీ రాలేదు కదా!?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు