10, జూన్ 2010, గురువారం

మందు x మందులు

9 కామెంట్‌లు
రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి!

25, మే 2010, మంగళవారం

ఒక్కడే మహానుభావుడు..

16 కామెంట్‌లు
మహానటుడు ఎస్వీరంగారావు గురించి బాపు రమణలు ఒక స్కెచ్చి రాసారు ఒకప్పుడు. రంగారావు మనస్తత్వాన్ని, అభిరుచులను, అలవాట్లను, నటన తీరునూ విశ్లేషిస్తూ అనేక రంగారావులను ఆవిష్కరిస్తారు -కంగారం’గారావు, ’చతురం’గారావు,.. -ఇలాగ.

4, మే 2010, మంగళవారం

ఐఐఐయో.. ఐఐఐటీ!

2 కామెంట్‌లు
రాష్ట్ర ఐఐఐటీల్లో ప్రభుత్వం సీట్లను తగ్గించేసింది. రెండేళ్ళ కిందట మొదలుపెట్టిన ఈ ఐఐఐటి వ్యవస్థను మొక్కగా ఉండగానే కత్తిరించడం మొదలుపెట్టింది. ఈ కత్తిరింపు, మొక్క ఏపుగా ఎదగడానికని ప్రభుత్వం చెబుతోంది.

26, ఏప్రిల్ 2010, సోమవారం

హై.లో మతకలహాలు ఏనాటివి?

16 కామెంట్‌లు
ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాదులో మతసామరస్యం వెల్లివిరిసేదంట. ఎప్పుడైతే ’ఆంద్రోళ్ళు’ ఇక్కడికి చేరుకున్నారో.. అప్పుడే ఇక్కడ మతకలహాలు మొదలయ్యాయని చెబుతున్నారు ఘనతవహించిన తె.వాదులు! చరిత్రను చాప కిందకు తోసేసి, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట ఓ టీవీలో ఘనత వహించిన విశ్లేషకుడొకరు, వెంటనే శనివారం నాడు కేసియారూ ఈ అబద్ధాన్ని చెప్పారు. 

5, ఏప్రిల్ 2010, సోమవారం

మే..ధావుల ’వర్గవివక్ష’

21 కామెంట్‌లు
తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు 'వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 

15, ఫిబ్రవరి 2010, సోమవారం

శ్రీకృష్ణ కమిటీ - సరైన మధ్యవర్తి!

7 కామెంట్‌లు
రెండు పక్షాల వారు తమలో తాము సంప్రదింపులు చేసుకుని ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితిలో మూడో పార్టీ రంగ ప్రవేశం చేసి మధ్యవర్తిత్వానికి శ్రీకృష్ణ కమిటీని సిద్ధం చేసింది. ’ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యపై సమాజంలోని వివిధ పార్టీలు, వర్గాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపేందుకు గాను’ ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దాని పనులేమేంటో కూడా తేల్చింది. కమిటీ విధుల జాబితా మూడు భాగాలుగా ఉంది..

సంబంధిత టపాలు